హైదరాబాద్: యాసంగి 2020 కు గాను రైతుబంధు మార్గదర్శకాలను వ్యవసాయ శాఖ విడుదల చేసింది.
10.12.2020 వరకు ధరణి లో నమోదైన భూ వివరాలను సీసీఎల్ఏ ద్వారా రైతు బంధుకు వ్యవసాయ శాఖ తీసుకుంది. కావున తేదీ 10.12.2020 వరకు కొత్త పాస్బుక్ల్లో ఎమ్మార్వో చేత సంతకమైన కాపీ పొందిన రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు చేసుకోని రైతులు 16/12/2020 నుంచి 19/12/2020 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గడువులోపు దరఖాస్తు చేసుకున్న రైతులకే రైతుబంధు లబ్ది చేకూరుతదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు
1 .అప్లికేషన్ ఫారం
2. పట్టాదారు పాస్బుక్ / ఎమ్మార్వో ఆఫీస్ కాపీ
3. ఆధార్ కార్డు జిరాక్స్
4. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్.
నోట్ (1) : గతంలో రైతుబంధు లబ్ధిదారులు అయి వుండి ఒకవేళ బ్యాంక్ వివరాలు మార్పు చేయాలనుకున్న రైతులు కొత్త మరియు పాత బ్యాంక్ వివరాలు ఆదజేయాలి
నోట్ (2): ఒకవేళ గతంలో దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసునోనవసరంలేదని వ్యవసాయశాఖ తెలిపింది..