మరో టైటిల్ నెగ్గిన నిఖత్ జరీన్
6వ ఎలైట్ ఉమెన్స్ నేషనల్ టైటిల్ లో ఛాంపియన్ గా నిఖత్ జరీన్
అభినందనలు తెలిపిన మంత్రి వేములవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ చేజిక్కించుకున్న నిజామాబాద్ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తాజాగా మధ్యప్రదేశ్ బోపాల్ లో జరిగిన 6వ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్ టైటిల్ సాధించిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని చిరస్థాయిలో నిలిచిపోయేలా తన ప్రతిభను కనబరుస్తున్న నిఖత్ జరీన్ కు మంత్రి వేముల శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.
సోమవారం జరిగిన తుదిపోరులో రైల్వేస్ (RSPB)బాక్సర్ అనామికతో తలపడి ఏకపక్ష విజయం నమోదు చేసింది నిఖత్ జరీన్. 50 కేజీల మహిళల ఫైనల్లో నిఖత్ 4-1 తో రైల్వేస్ బాక్సర్ అనామికపై గెలుపొందింది. పోరు ఆరంభం నుంచే వరుస పంచ్లతో విరుచుకుపడిన నిఖత్కు, అనామిక కనీస పోటీనివ్వలేకపోయింది.